న్యూఢిల్లీ, నవంబర్ 28: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘మెసేజ్ యువర్సెల్ఫ్’ అనే సరికొత్త ఫీచర్ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు తామే మెసేజ్లు పంపుకోవచ్చు. నోట్స్, రిమైండర్స్, అప్డేట్స్, పాస్వర్డ్స్సహా ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని వినియోగదారులు తమ వాట్సాప్కు మెసేజ్ పంపుకొని, భద్రపరుచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం వాట్సాప్ అప్లికేషన్లోకి వెళ్లి క్రియేట్ న్యూ చాట్పై క్లిక్ చేయాలి. అనంతరం పైన కనిపించే సొంత కాంటాక్ట్ నంబర్పై క్లిక్ చేసి, మెసేజ్లు పంపుకోవచ్చు. రాబోయే వారాల్లో ఈ కొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ వెల్లడించింది.