Viral Video | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాజస్థాన్లో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఫొటో అద్దం పడుతున్నది. ఓ బీఎస్ఎఫ్ సైనికుడు రాజస్థాన్ బికనీర్లో ఇసుకపై పాపడ్ను వేయిస్తూ ఎండలు ఎంత దారుణంగా ఉన్నదో చూపుతుంది.
ప్రతికూల పరిస్థితుల్లో మన దేశ సరిహద్దుల రక్షణలో భారత సైనికులు ఎలా భద్రతలో నిమగ్నమయ్యారో ఫొటోను చూస్తే తెలిసిపోతుంది. ఈ ఫొటో సోషల్ మీడియాల్గా మారింది. ఓ వైపు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా.. మరోవైపు దేశ సరిహద్దుల్లో మన సైనికులు భానుడు కురిపిస్తున్న నిప్పుల వానను తట్టుకొని ప్రతికూల పరిస్థితుల్లో సైన్యం పహారా కాస్తున్నారు. వైరల్ అయిన ఫొటో బికనీర్లోని ఖాజువాలా పాక్ సరిహద్దులో ఉంది. రాజస్థాన్లో అత్యధికంగా వేడి బికనీర్లో ఉంటుంది.
उफ ये गर्मी! बीकानेर में 47 डिग्री पार पहुंचा पारा, तपती रेत पर @BSF_India जवान ने सेंका पापड़। इतनी गर्मी में भी जवान सीमा पर निभा रहे फर्ज… देखें वीडियो #summersafety
पूरी खबर पढ़ें- https://t.co/ToEeaJcxG9 pic.twitter.com/yyCajuv1lt— Amar Ujala (@AmarUjalaNews) May 22, 2024