భోపాల్: పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు ఒక వ్యక్తిని బీజేపీ నేత విచక్షణ రహితంగా కొట్టాడు. అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రత్లాం సర్సి గ్రామానికి చెందిన 65 ఏండ్ల భన్వర్లాల్ జైన్ ఈ నెల 15న తన కుటుంబంతో కలిసి రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. అనంతరం ఈ నెల 18 నుంచి ఆయన అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు భన్వర్లాల్ జైన్ మృతదేహం శుక్రవారం మానస ప్రాంతంలో కనిపించింది. అయితే మానసిక వికలాంగుడైన ఆ వృద్ధుడ్ని మానస బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త దినేష్ కుష్వాహ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘నీ పేరు ఏమిటి? మహమ్మద్ కదా?’ అని దినేష్ కుష్వాహ ఆ వృద్ధుడ్ని అడిగాడు. ‘ముస్లింనా, పేరు సరిగ్గా చెప్పు, నీ ఆధార్ కార్డు చూపించు’ అంటూ జైన్ చెంపలు, ముఖంపై పలుమార్లు కొట్టాడు. దెబ్బలు తాళలేక డబ్బులు ఇస్తానంటూ ఆ వృద్ధుడు ప్రాధేయపడ్డాడు.
మరోవైపు ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వృద్ధుడు జైన్పై దాడి చేసిన బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త దినేష్ కుష్వాహపై హత్యతోపాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితు పట్వారీ ఈ ఘటనపై మండిపడ్డారు. మధ్య ప్రదేశ్లో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. ‘ఆధార్ కార్డు చూపించనందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ముస్లిం, దళిత, గిరిజనుల తర్వాత జైనులపై దాడి చేస్తున్నారు. ఎంపీలో ఎవరూ సురక్షితంగా లేరు. హోంమంత్రి దీనిపై నోరు విప్పాలి’ అని నిలదీశారు.
A murder case has been registered in after a 65-year-old with mental illness was found dead and a video showed Dinesh Kushwaha, husband of an ex BJP corporator asking him if his “name is Mohammed” and repeatedly assaulting him as he struggled to answer @ndtv @ndtvindia pic.twitter.com/jWNDlLKpFb
— Anurag Dwary (@Anurag_Dwary) May 21, 2022