హవేరి: కర్నాటక(Karnataka)లోని హనగల్లో ఓ జంటపై అటాక్ జరిగిన విషయం తెలిసిందే. లాడ్జిలో ఉన్న ఆ జంటపై ఏడుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ ఏడుగిరిపైనా రేప్ కేసు నమోదు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఏడు మంది తనపై గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు ఆ మహిళ పేర్కొన్నది. 376 డీ(గ్యాంగ్రేప్) సెక్షన్ కింద కూడా కేసు బుక్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసులో మొన్ననే ముగ్గురు ముస్లిం యువకుల్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓ నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో మిగితా అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అందర్నీ గుర్తించినట్లు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రాకరం.. జనవరి 8వ తేదీన మైనార్టీ వర్గానికి చెందిన 26 ఏళ్ల వివాహిత మహిళ ఓ హోటల్ రూమ్లోకి చెక్ ఇన్ అయ్యింది. ఆమెతో పాటు 40 ఏళ్ల కేఎస్ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే గత మూడేళ్ల నుంచి ఆ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
అటాక్ చేసిన ఏడుగురూ తమ ఎపిసోడ్ను మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో గొడవ బయటపడింది. హోటల్ రూమ్ తలుపు కొట్టి లోపలికి ప్రవేశించిన ఆరుగురు.. ఆ రూమ్లో ఉన్న జంటపై దాడి చేశారు. బుర్కాలో ఉన్న మహిళను తన్నారు. ఆమెతో ఉన్న డ్రైవర్ను కూడా చితక్కొట్టారు. ఇద్దర్నీ రూమ్ బయటకు లాక్కెళ్లినట్లు తెలుస్తోంది.
బైక్లపై వచ్చిన ఏడుగురి.. హోటల్ నుంచి ఆ జంటను తీసుకెళ్లి అక్కడ కూడా దాడి చేశారు. మహిళను కర్రతో కొట్టినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమెకు 500 ఇచ్చి స్వంత ఊరికి వెళ్లాలంటూ బెదిరించారు. సిర్సిలో ఉన్న తన భర్త వద్దకు ఆమె వెళ్లింది. దాడి చేసిన గ్యాంగ్.. ఏ సంస్థకూ లింకు లేదని తెలిసింది. అరెస్టు అయినవారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు.