న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ నేత, పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) ఇటీవల ఓ శివాలయాన్ని దర్శించారు. పూంచ్(Poonch) జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఆమె అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ గుడికి వెళ్లి పూజలు చేసిన విషయాన్ని ఆమె సమర్ధించుకున్నారు. ఈ దేశంలో గాంగా-జమున సంగమం జరుగుతుందని, ఇలాంటి దేశంలో మన జీవిస్తున్నామని, ఇటువంటి అంశాలపై చర్చించడం సరికాదు అని ఆమె అన్నారు.
#WATCH | This temple was built by Yashpal Sharma & his son wanted me to go inside temple. After that, somebody gave me a vessel containing water, so it would have been wrong to deny it so I offered prayers: PDP chief M Mufti on offering prayers at Navagraha temple in Pooch pic.twitter.com/evgHCLAUs3
— ANI (@ANI) March 16, 2023
పూంచ్ జిల్లాలోని మండీ అజోత్లో ఉన్న నవగ్రహ ఆలయంలో ముఫ్తీ పూజలు చేశారు. పూజారి ఆమెకు నీళ్లు ఇవ్వగా.. ఆమె ఆ నీటితో శివాభిషేకం చేసింది. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో ముఫ్తీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆలయాన్ని యశ్పాల్ శర్మ నిర్మించారని, ఆ గుడికి రావాలంటూ యశ్పాల్(Yashpal) కుమారులు తనను ఆహ్వానించారని, గర్భగుడిలోకి వెళ్లిన తర్వాత నీటి చెంబును ఇచ్చారని, నమ్మకం.. ప్రేమతో ఆ నీటి చెంబును తన చేతుల్లో పెట్టారని మెహబూబా అన్నారు.
Is this official gharwapsi of Mehbooba mufti ? If not she shud not be allowed to enter the garbhagriha of any temple https://t.co/DsebAWnBzn
— exsecular (@ExSecular) March 16, 2023
శివలింగంపై నీళ్లు పోయకుండా పూజారి గుండెను గాయం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని ముఫ్తీ అన్నారు. పూజారి అడగడంతో.. ఆయన మీద గౌరవంతో అలా చేశానని ముఫ్తీ అన్నారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు కలిసి జీవిస్తారని, ముస్లిం దర్గాల్లో హిందువులు చాదర్ కానుకగా ఇస్తారన్నారు. ఇది తనకు చెందిన ఇష్యూ అని, దీంట్లో మరింత డిస్కషన్ అవసరం లేదని మెహబూబా అన్నారు.