ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్పై బీజేపీ నేత కిరిట్ సోమయ్య భార్య మేధా కిరిట్ రూ.100కోట్లకు పరువునష్టం దావా వేశారు. బాంబే హైకోర్టులో దావా దాఖలు చేశారు. గతంలో సంజయ్ రౌత్ టాయిలెట్ల కుంభకోణంలో మేధా ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో తన భర్త రూ.100కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలను చూసి తాను షాక్కు గురయ్యానని బీజేపీ నేత భార్య పేర్కొన్నారు. కుంభకోణంలో తన ప్రమేయం ఉందంటూ రౌత్ మీడియాలో చేసిన ప్రకటనలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆరోపణలపై ఇప్పటికే మేధా కిరీట్ క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువును నష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.