Coaching Centre Tragedy : ఢిల్లీలో పలు కోచింగ్ సెంటర్లను అక్రమంగా బేస్మెంట్స్లో నడిపిస్తున్నారని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) భవన నిర్మాణ చట్టాలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆమె ఆరోపించారు. అక్రమంగా నడుస్తున్న అన్ని కోచింగ్ సెంటర్లపై తాము కఠిన చర్యలు చేపడతామని షెల్లీ ఒబెరాయ్ హెచ్చరించారు. ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాకానికి బాధ్యులైన అధికారులపైనా చర్యలు ఉంటాయని చెప్పారు. సంస్కృతి అకాడమీ బేస్మెంట్లో చట్టవిరుద్ధంగా కోచింగ్ సెంటర్ నడుస్తోందని, ఇది ఎంసీడీ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఎంసీడీ ఇలాంటి నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఢిల్లీ అంతటా అక్రమ కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కాగా, ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఉవ్వెత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్లో జరిగిన దురదృష్టకర ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్ధులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం తమ బాధ్యతని మంత్రి వివరించారు.
Read More :
Gold Rates | మరింత దిగిన బంగారం.. తులం వెయ్యి రూపాయలదాకా తగ్గుదల