లక్నో: భారతీయ జనతాపార్టీపైన, దాని మాతృసంస్థ RSS పైన బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. RSS, బీజేపీ నాయకుల మాటలకు, చేతలకు పొంతనే ఉండదని ఆమె మండిపడ్డారు. దేశంలోని అందరి డీఎన్ఏ ఒకటేనని RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. RSS ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని విమర్శించారు. రాజకీయాలు దేశ ప్రజలను విభజిస్తాయన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదన్నారు.
కులతత్వం, మతతత్వం, ద్వేషం సాధారణ ప్రజలను పట్టి పీడిస్తున్నాయని, దీనికంతటికీ కారణం RSS గుడ్డిగా బీజేపీకి మద్దతు పలకడం వల్లేనని అన్నారు. ఆరెస్సెస్ లేకుంటే బీజేపీకి ఉనికే ఉండదని, అయినా, తాము ఆశించిన ఫలితాలను బీజేపీ నుంచి RSS ఎందుకు రాబట్టుకోలేకపోతోందో చెప్పాలని మాయావతి డిమాండ్ చేశారు. RSS ది రెండు నాలుకల ధోరణి అని దుయ్యబట్టారు.