మాయావతి డిమాండ్
లక్నో: ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రీ పోల్ సర్వేలను నిషేధించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 15వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ ‘ప్రీ పోల్ సర్వేల పేరుతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని పార్టీలు (బీజేపీని ఉద్దేశించి) ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి జిమ్మిక్కులకు ఫుల్స్టాప్ పెట్టాలి. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రీ పోల్ సర్వేలను నిషేధించాలి. ఈ మేరకు త్వరలోనే ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తా’ అని పేర్కొన్నారు.