న్యూఢిల్లీ: కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా 2021కి గానూ ‘రామానుజన్ ప్రైజ్’ అందుకున్నారు. అఫిన్ అల్జీబ్రిక్ జామిట్రీ, కమ్యుటేటివ్ జామిట్రీలో చేసిన విశేష కృషికిగానూ ఆమె ఈ అవార్డు సాధించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ఈ బహుమతి అందుకున్న భారతీయుల్లో నీనా గుప్తా నాలుగో వ్యక్తి అని, అదేవిధంగా మూడో మహిళ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.