న్యూఢిల్లీ, మార్చి 28: భారత్లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రసూతి మరణాల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ప్రసూతి, గైనకాలజీ, మహిళా ఆరోగ్య పత్రిక లాన్సెట్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం భారత్లో 1990 నుంచి 2023 వరకు ప్రతి లక్ష సజీవ జననాల్లో ప్రసూతి మరణాల రేటు 508 నుంచి 116కు తగ్గింది. ఈ 80 శాతం తగ్గుదల ప్రపంచ సగటు కన్నా మెరుగ్గా ఉంది.
2023లో భారత్లో 24,700 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ఇది ప్రతి లక్ష జననాలకు 116 మాతృ మరణాల రేటుకు సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రసూతి మరణాలు గత మూడు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్నా, ఈ ప్రగతిలో ఇటీవల తగ్గుదల ఏర్పడింది. అలాగే ఒక దేశానికి, మరో దేశానికి మధ్య తీవ్ర వ్యత్యాసాలు కన్పించాయి.