ఎవరి జీవితంలోనైనా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆ విషయాన్ని నేటి తరం యువతకు అర్థమయ్యేలా వినూత్నంగా చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.
గత వారం ఆయన పండిట్ దీన్దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘నేటి తరం యువత 4జీ, 5జీ టెక్నాలజీపై చాలా ఆసక్తి చూపుతున్నారని ఆయన గుర్తుచేస్తూ.. ‘ప్రపంచంలో మాతాజీ, పితాజీ కంటే ఏ ‘జీ’ గొప్పది కాదు. వారు పడిన కష్టాలను, చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దు’ అని అన్నారు.