New Year | మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రపంచమంతా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదిని సరికొత్తగా ఆహ్వానించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. తమకు ఇష్టమైన ప్రదేశాలకు పయనమవుతున్నారు. దీంతో దేశంలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. గోవా, మనాలీ, ముంబయి తదితర ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. దేశ ప్రజలే కాకుండా.. విదేశీయులు సైతం కొత్త ఏడాది వేడుకల కోసం గోవా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ బీచ్లు, హోటల్స్ అన్నీ రద్దీగా మారాయి.
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలీకి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకుల వాహనాలతో మనాలీలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముందుకు కదల్లేని పరిస్థితుల్లో గంటల తరబడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పలువురు పర్యాటకులు వాహనాలు దిగి నడిరోడ్డుపై సరదాగా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు నూతన ఏడాది వేళ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
Himachal Pradesh | Massive traffic jam in Manali as people throng to hilly areas to celebrate #NewYear2023 pic.twitter.com/D9J3mPo0f7
— ANI (@ANI) December 31, 2022