లక్నో: పాతాల్కోట్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. (Patalkot Express Fire) ఈ ప్రమాదంలో రెండు కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ నుంచి మధ్యప్రదేశ్లోని సోనీకి వెళ్లే పాతాల్కోట్ ఎక్స్ప్రెస్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఆగ్రా-ధోల్పూర్ మధ్య భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో జనరల్ కోచ్లో మంటలు రాజకున్నాయి. ఈ మంటలు ఇతర కోచ్లకు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళన చెందారు.
కాగా, మంటలు, పొగలు గమనించిన లోకోపైలట్లు ఆ రైలును నిలిపివేశారు. కాలుతున్న కోచ్లను వేరు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు రైలు కోచ్లు మంటల్లో కాలుతున్న వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
आगरा में चलती ट्रेन में लगी आग. एक्सप्रेस ट्रेन के दो डिब्बों में लगी आग. थाना मलपुरा क्षेत्र के भाड़ई रेलवे स्टेशन के पास लगी आग. @RailMinIndia pic.twitter.com/DtFSKU00iF
— Himanshu Tripathi (@thimanshut) October 25, 2023