Lucknow : ఉత్తరప్రదేశల్ రాజధాని లక్నోలోని ఒక హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఛార్బాగ్ స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్న రంగోలి హోటల్లో సిలిండర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మరణించాడు. మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి 9ః30 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే వాళ్లలో ఒక వ్యక్తి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అతడిని నాసిక్కు చెందిన ప్రకాశ్ సుధాకర్గా గుర్తించారు.
ఛార్బాగ్ స్టేషన్ రోడ్డులో బేస్మెంట్లో ఉన్న హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల హోటల్లో మంటలు చెలరేగాయి. దాంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. మంటల్ని అదుపు చేసేందుకు హోటల్ యజమాని, సిబ్బంది ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి విషయం తెలియజేశారు. దాంతో ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని అడిషన్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ శ్రీవాత్సవ తెలిపారు.