ఈమధ్య వెరైటీ వంటకాలకు సంబంధించిన చాలా వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. పానీపూరీ ఐస్క్రీమ్ అని.. యాపిల్తో పకోడి.. ఒరియో బిస్కెట్లతో పకోడీ.. పానీపూరీ నూడుల్స్.. ఇలా తమకు నచ్చినట్టుగా కొందరు వంటకాలు చేసి వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ వంటకాలను చూసే నెటిజన్లు మాత్రం యాక్ అంటున్నారు. తాజాగా మసాలా దోశతో ఐస్క్రీమ్ రోల్ను తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తల బాదుకుంటున్నారు. మసాలా దోశతో ఐస్క్రీమ్ రోలేంట్రా సామీ.. దీన్ని ఎవడైనా తింటాడా? ఇలాంటివి చూడటానికేనా మేము బతికి ఉంది.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. ఢిల్లీలో ఇలా మసాలా దోశతో ఐస్ క్రీమ్ రోల్ను తయారు చేస్తారట. అక్కడ దీన్ని లొట్టలేసుకుంటూ తింటారట.