విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని (AP) విశాఖపట్నంలో (VIshakapatnam) ఓ యువతి ట్రయాంగిల్ లవ్స్టోరీ కలకలం రేపింది. గోపాలపట్నానికి (Gopalapatnam) చెందిన ఓ యువతి ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. అయితే వారిద్దరినీ కాదని మరో యువడితో రహస్యంగా పెండ్లి చేసుకున్నది. అయితే వివాహం తర్వాత కూడా వారిద్దరితో చనువుగా ఉన్నది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు. కాగా, తన ఇద్దరు ప్రేమికుల్లో ఓ యువకుడు వారింటికి వచ్చి తామిద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోమ్మని పంచాయితీ పెట్టాడు.
తన బాగోతమంతా అత్తగారింట్లో తెలిసిపోవడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ప్రేమికుడు రైలు కింద పడి ఆత్మహత్యం చేసుకున్నాడు. యువతి రాసిన సూసైట్ నోట్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలను లోతుగా పరిశీలిస్తున్నారు. కాగా, యువతి ఘనకార్యం తెలుసుకున్న విశాఖ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.