న్యూఢిల్లీ, జూలై 13 (నమస్తే తెలంగాణ) : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులను ఓ భారతీయ దంపతుల నుంచి బుధవారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం జగిత్ సింగ్, జస్వీందర్ కౌర్ దంపతులను అరెస్టు చేశారు. ఈ తుపాకుల విలువ రూ. 22.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దంపతులిద్దరూ ఈ నెల 10న వియత్నాం నుండి భారత్కు రాగా, వీరి బ్యాగుల్లో 45 తుపాకులను గుర్తించారు. ఈ తుపాకుల బ్యాగులు తన సోదరుడు ఇచ్చారని జగిత్ సింగ్ చెప్పారు. గతంలో టర్కీ నుంచి మన దేశానికి 25 తుపాకులు తీసుకొచ్చినట్టు నిందితులైన దంపతులు అంగీకరించారు.