Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దర్బాలో ప్రతి ఆదివారం జరిగే మార్కెట్లో పోలీసు ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ తేజో రామ్ భూర్య మార్కెట్లో విధులు నిర్వర్తిస్తుండగా, మావోయిస్టులు దాడి చేశాడు. గొడ్డలితో తేజో రామ్ను నరికి చంపారు.
ఈ ఘటనపై బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ స్పందించారు. పోలీసు ఆఫీసర్ తేజో రామ్ను మావోయిస్టులు హత్య చేసినట్లు ఎస్పీ ధృవీకరించారు. తేజో రామ్ ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన ఫోర్త్ బెటాలియన్లో కంపెనీ కమాండర్గా పని చేస్తున్నారు. ఈ బెటాలియన్ను దర్బా క్యాంపులో విధుల్లో ఉంచారు. అయితే మావోయిస్టులు గ్రామస్తుల మాదిరిగానే మార్కెట్లోకి ప్రవేశించి, ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది.