కాన్పూర్ : సర్జికల్ మాస్క్.. ఎన్95 మాస్క్.. ఇవన్నీ కామన్. కానీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన మనోజ్ సెంగార్.. బంగారు మాస్క్ను చేయించుకున్నారు. గోల్డెన్ బాబాగా పేరుగాంచిన మనోజానంద మహారాజ్ అలియాస్ మనోజ్ సెంగార్ బంగారు మాస్క్ ధరించారు. ఆ మాస్క్ ఖరీదు 5 లక్షలు. కరోనా సెకండ్ వేవ్ చాలా భయానకంగా దాడి చేసిందని, ప్రజలు సరైన రీతిలో మాస్క్లు ధరించడంలేదని, తాను చేయించుకున్న బంగారు మాస్క్ ట్రిపుల్ కోటింగ్ ఉందని, పూర్తిగా శానిటైజ్ అయినట్లు ఆయన చెప్పారు. కనీసం మూడేళ్ల పాటు ఆ మాస్క్ పనిచేస్తుందని గోల్డెన్ బాబా తెలిపారు.