ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మహిళను చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉడికించిన దారుణ సంఘటనకు (Mumbai Mira Road murder) సంబంధించి మరిన్ని విషయాలను పోలీసులు శుక్రవారం బయటపెట్టారు. హతురాలు సరస్వతీ వైద్య, హంతకుడు మనోజ్ సానే భార్యాభర్తలని తెలిపారు. అయితే వారిద్దరి మధ్య వయసులో గ్యాప్ వల్ల తమ వివాహాన్ని దాచిపెట్టినట్లు చెప్పారు. సరస్వతికి నలుగురు అక్కలున్నారని, వారిలో ముగ్గురిని ప్రశ్నించగా ఈ విషయం తెలిసినట్లు వెల్లడించారు.
కాగా, మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన 32 ఏళ్ల సరస్వతి తల్లి చనిపోయిందని, చాలా కాలం కిందట తండ్రి వారిని వదిలి వెళ్లాడని పోలీసు అధికారి జయంత్ తెలిపారు. ఐదుగురు ఆడ పిల్లల్లో సరస్వతి చివరి సంతానమని చెప్పారు. వారంతా వేర్వేరు ప్రాంతాల్లోని అనాథాశ్రయాల్లో పెరిగినట్లు వెల్లడించారు. కొంతకాలం పాటు ఒక అనాథాశ్రమంలో ఉన్న సరస్వతి, ఆ తర్వాత ముంబైకు వచ్చిందన్నారు. బోరివాలి ప్రాంతంలోని రేషన్ షాప్లో పని చేసే 56 ఏళ్ల మనోజ్ సానేతో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు చెప్పారు. దీంతో సరస్వతికి ఉద్యోగం ఇచ్చాడని, అతడి ఇంట్లోనే వారు కలిసి ఉంటున్నారని వెల్లడించారు.
మరోవైపు సరస్వతి, మనోజ్ ఒక గుడిలో పెళ్లి చేసుకున్నట్లు పోలీసు అధికారి జయంత్ తెలిపారు. అయితే ఈ పెళ్లి గురించి తన సిస్టర్స్కు మాత్రమే ఆమె చెప్పిందన్నారు. వారిద్దరి మధ్య వయసులో 24 ఏళ్ల తేడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమ పెళ్లి విషయాన్ని వారిద్దరూ దాచి ఉంచారని చెప్పారు. అలాగే మనోజ్ను మేనమామగాను, మిల్లు యజమానిగాను సరస్వతీ అందరికీ చెప్పడంతో వారిద్దరూ భార్యాభర్తలన్న సంగతి ఎవరికీ తెలియలేదని అన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటంతో వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగా అంతా భావించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
కాగా, తమ ఇద్దరి మధ్య ఎప్పుడూ పోట్లాట జరిగేదని నిందితుడు మనోజ్ పోలీసులకు తెలిపాడు. ఆదివారం తీవ్ర ఘర్షణ తర్వాత సరస్వతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో భయపడిన తాను ఎలక్ట్రిక్ రంపాన్ని కొని మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అయితే సరస్వతి హత్యను దాచేందుకు మనోజ్ అబద్ధం చెబుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు మంగళవారం మనోజ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగింటి వారు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. ఇంటి తలుపు బద్ధలుకొట్టి లోపలకు వెళ్లారు. వంటగదిలో మూడు బకెట్ల నిండా సరస్వతి మృతదేహం ముక్కలు ఉండటం చూసి షాకయ్యారు. కాగా, పోలీసులను చూసిన మనోజ్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే లిఫ్ట్లో ఉన్న అతడ్ని పొరుగువారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
#WATCH | "32-year-old woman, Saraswati Vaidya killed by 56-year-old live-in partner Manoj Sane |…" During the investigation, we have found out that the victim and accused were married and they had informed this to the victim's sisters also, they hid this from the others because… pic.twitter.com/vlpXvWq5qF
— ANI (@ANI) June 9, 2023