న్యూఢిల్లీ: కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరిన భారత మాజీ మన్మోహన్ సింగ్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. దీన్ని ఎయిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం మన్మోహన్ సింగ్ కోలుకుంటున్నారు.
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కొన్నిరోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆయన ఎయిమ్స్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ట్వీట్లు చేశారు.