న్యూఢిల్లీ, మార్చి 20: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల 3 వరకు కోర్టు పొడిగించింది.
సీబీఐ నమోదు చేసిన కేసులో విధించిన జ్యుడీషియల్ కస్టడీ సోమవారం ముగియడంతో తాజాగా మరోసారి పొడిగించింది. సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.