రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నది. తమకు ఓటేసి గెలిపిస్తే.. రాష్ట్ర ప్రజలను అయోధ్య రామమందిర సందర్శనకు తీసుకెళ్తామంటూ శుక్రవారం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ‘మోదీ గ్యారంటీల’ పేరుతో అమిత్షా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో 20 రకాల హామీలను పేర్కొన్నారు.