లక్నో: గాడిద పాలతో చేసిన సబ్బుతో మహిళల చర్మం ఎప్పటికీ అందంగా నిగనిగలాడుతూ ఉంటుందని బీజేపీ ఎంపీ మేనకాగాంధీ అన్నారు. యూపీలోని సుల్తాన్పూర్ జిల్లా చౌపల్లో సోమవారం మాట్లాడుతూ ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా ఈ సబ్బులతోనే స్నానం చేసేవారని చెప్పారు.
గాడిద పాలతో తయారుచేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉందన్నారు. ‘మనమెందుకు మేకపాలు, గాడిద పాలతో సబ్బులు తయారు చేయకూడదు. లఢక్లో గాడిదల సంఖ్య తగ్గిపోవడంతో ఓ సంఘం వారు వాటి పాలతో సబ్బులను తయారుచేయడం మొదలుపెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు’ అని చెప్పారు.