జైపూర్: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా లో ఓ యువకుడిని చితక్కొట్టి, నగ్నంగా ఊరేగించిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సదర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుఖ్రామ్ చోటియా వివరాల ప్రకారం.. బస్ని బెహ్లిమా గ్రామంలో దొంగతనం చేశాడనే అనుమానంతో షకీల్ అనే వ్యక్తి ని ముగ్గురు వ్యక్తులు చితక్కొట్టి, నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 2014 నుంచి 2022 మధ్యలో షకీల్పై 5దొంగతనం కేసులు నమోదయ్యాయి.