జైపూర్: కుమార్తెను కోచింగ్కు తీసుకెళ్తున్న వ్యక్తి, గ్యాంగ్స్టర్పై కాల్పుల సందర్భంగా బుల్లెట్లు దూసుకెళ్లడంతో మరణించాడు. రాజస్థాన్లోని సికర్లో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. పిప్రలి రోడ్లోని ఇంటి ఎంట్రన్స్ వద్ద ఉన్న గ్యాంగ్స్టర్ రాజు తేత్ను నలుగురు దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మరణించగా అతడి బంధువు గాయపడ్డాడు. తారాచంద్ కద్వాసర అనే వ్యక్తి తన కూమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆమెతోపాటు ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఆయన వెంట అతడి బంధువు కూడా ఉన్నాడు. అయితే గ్యాంగ్స్టర్ రాజు తేత్పై కాల్పుల సందర్భంగా తారాచంద్, ఆయన బంధువుకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. తారాచంద్ అక్కడికక్కడే చనిపోగా, బంధువు గాయపడ్డాడు. కాల్పులు జరిగిన ఆ ప్రాంతంలో చాలా కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు ఉన్నాయి. గ్యాంగ్స్టర్ తేత్ సోదరుడు కూడా ఒక హాస్టల్ను నిర్వహిస్తున్నాడు.
కాగా, గ్యాంగ్స్టర్ రాజు తేత్ను తామే కాల్చి చంపినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. ఆ గ్యాంగ్కు చెందిన రోహిత్ గోద్రా ఫేస్బుక్ ద్వారా ఈ విషయం వెల్లడించాడు. సోదరులు ఆనంద్ పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకే రాజు తేత్ను హత్య చేసినట్లు అందులో పేర్కొన్నాడు.
మరోవైపు కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసేందుకు రాజస్థాన్ వ్యాప్తంగా వెతుకున్నట్లు వెల్లడించారు. కాగా, గ్యాంగ్స్టర్ రాజు తేత్ను కాల్చి చంపిన తర్వాత గన్స్తో గాల్లోకి కాల్పులు జరుపుతూ నలుగురు దుండగులు అక్కడి నుంచి వెళ్లడం ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికారైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gang war in Sikar, Rajasthan.
Gangster Raju Theth shot dead.
Earlier Raju Theth had enmity with the Anandpal gang, according to sources currently Anandpal gang and Bishnoi gang were together.
Sikar police is investigating the matter. pic.twitter.com/ZLkkcNshRH— Ravi Chaturvedi (@Ravi4Bharat) December 3, 2022