బెంగళూరు : అమ్మాయిది అగ్ర వర్ణం.. అబ్బాయిది తక్కువ కులం. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. అతనితో సంబంధాలు తెంచుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె తన ప్రేమాయణం కొనసాగిస్తుండటంతో.. తండ్రికి నచ్చక గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెరియపట్న తాలుకా కగ్గుండి గ్రామానికి చెందిన ఓ యువతి.. దళితుడిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తోంది. అయితే వీరి ప్రేమ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. తక్కువ కులం యువకుడిని ఎలా ప్రేమిస్తావంటూ ఆమెను తల్లిదండ్రులు మందలించారు. అతన్ని మరిచిపోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె తల్లిదండ్రుల మాటలను లెక్కచేయకుండా.. ఆ యువకుడితో తన సంబంధాలను కొనసాగిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై తన 17 ఏండ్ల కూతుర్ని తండ్రి గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసులో నిందితుడిని మైసూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.