ముంబై: వాళ్లిద్దరు ప్రాణస్నేహితులు. ప్రజా పోరాటాలు చేసి రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. వారిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవగా, మరొకరు అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉంటారు. అయితే స్నేహితుడే రాష్ట్రాధినేతగా ఉండటంతో తనను ఏం చేయడనుకుని.. అతనికి తెలియకుండా భారీ అవినీతికి పాల్పడుతాడు. ఓ జర్నిలిస్టు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం.. స్నేహితుడికి తెలియకుడా ఎంక్వైరీ చేయిస్తాడు. ఇది తెలుసుకున్న అతడు.. సీఎంకి స్లో పాయిజన్ ఇచ్చి ఆరోగ్యం క్షీణించి చివరికి కన్నుమూస్తాడు.. ఇది సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ఓ సినిమా కథ.
అయితే అచ్చం ఇలాగే ఓ మహిళ తన భర్తను చంపేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె.. భర్త ఆస్తికోసం.. అతని ఆహారంలో రోజూ కొంచంకొం విషం కలుపుతూ వచ్చింది. ఒక రోజు తీవ్రమైన కడుపునొప్పితో అతడు మరణించాడు. అయితే వైద్యుల నివేదిక పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో ఆమెను, ప్రియుడిని అరెస్టు చేశారు.
కవిత, కమల్కాంత్ షా ఇద్దరు భార్యాభర్తలు. ముంబైలోని శాంత్రాక్రూజ్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే కమల్కాంత్ స్నేహితుడు హితేశ్తో కవిత వివాహేతర సంబంధం పెట్టుకున్నది. దీంతో దంపతుల మధ్య తరచు గోడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమె వేరుగా ఉంటున్నది. అయితే కొన్ని రోజుల క్రితం కవిత తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. పిల్లల భవిష్యత్ కోసం కలిసే ఉందామని నమ్మపలికింది.
కాగా, ఈ ఏడాది జూన్లో కమల్కాంత్ తల్లి కడుపునొప్పితో మరణించింది. దీంతో కమల్ అడ్డు కూడా తొలగించుకుంటే ఆస్తి మొత్తం తమ వషమవుతుందని కవిత, ఆమె ప్రియుడు హితేశ్ ప్లాన్ వేశారు. దీంతో అతడు తినే ఆహారంలో ఆర్సెనిక్ కలపడం ప్రారంభించారు. అదికాస్త స్లో పాయిజన్గా మారడంతో కొతకాలానికి అతని ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న కమల్ను ఆగస్టు 27న అంధేరీలోని ఓ దవాఖానలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం సెప్టెంబర్ 3న ముంబైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 19న కమల్కాంత్ చనిపోయాడు.
దీంతో పోలీసులు సహజ మరణంగా కేసు నమోదుచేశారు. అయితే వైద్యుల నివేదిక పరిశీలించిన తర్వాత వారికి అనుమానం కలిగింది. అతని శరీరంలో ఆర్సెనిక్, థాలియం ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో కవితను తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.