లక్నో : పాత బకాయిలు చెల్లిస్తేనే కటింగ్ చేస్తానని చెప్పడంతో ఓ వ్యక్తి క్షౌరకుడిని కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన యూపీ బులంద్షహార్ జిల్లాలోని షరీఫ్పూర్ భాయిన్స్రోలి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఇర్ఫాన్ అనే వ్యక్తి స్థానికంగా హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతున్నాడు.
సమీర్ అనే వ్యక్తి బుధవారం రోజు కటింగ్ చేయించుకుందామని సెలూన్కు వచ్చాడు. అప్పటికే చాలా పాత బకాయిలు ఉండటంతో.. అవి చెల్లిస్తేనే కటింగ్ చేస్తానని ఇర్ఫాన్ చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సమీర్ తన లైసెన్స్డ్ తుపాకీతో ఇర్ఫాన్ను కాల్చి చంపాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.