లక్నో : ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి ప్రాణాలను బలిగొంటోంది. ఓ కుమారుడి చితికి నిప్పు పెట్టిన సమయంలోనే మరో కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాకు సమీపంలోని జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
అత్తర్ సింగ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆ ఇద్దరికి ఇటీవలే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పంకజ్ అనే కుమారుడు మంగళవారం మృతి చెందగా, అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. రెండో కుమారుడు కూడా కరోనాతో బాధపడుతున్నాడు. మొదటి కుమారుడు అంత్యక్రియలు చేస్తున్న సమయంలోనే రెండో కుమారుడు దీపక్ ఇంట్లో కుప్పకూలిపోయాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారుడు చనిపోవడం అత్తర్ కుటుంబాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది.