దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలాచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, హైదరాబాద్లో ఓ వ్యక్తి స్కూటర్ సీటుపై దోస పోసి, ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘స్ట్రీట్ఫుడ్ ఆఫ్ భాగ్యనగర్’ అనే యూజర్ ఇన్స్టాలో షేర్చేశారు. ఇందులో ఓ వ్యక్తి మొదట స్కూటర్ సీటుపై కొద్దిగా దోస పిండిని పోశాడు. దాన్ని గరిటెతో మరోవైపు తిప్పి కాల్చాడు. చివరగా సీటు వేడికి దోస తయారైనట్లు కనిపించింది. ఈ వీడియోకు ‘ఇంట్లో ప్రయత్నించవద్దు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘వావ్ ఆ సీట్ వకర్ నాన్స్టిక్ తవా కంటే చాలా బాగుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘సీటు కవర్పై దోస తయారవదని, ఇది ఫేక్ వీడియో’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
View this post on Instagram
A post shared by Bharadwaj food blogger| Hyderabad (@streetfoodofbhagyanagar)