లక్నో: పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చెందిన మహిళా ఏజెంట్, ఆయుధ కర్మాగారంలో పనిచేస్తున్న వ్యక్తిని హనీట్రాప్ చేసింది. ఫేస్బుక్లో పరిచయమైన ఆ మహిళకు రక్షణ శాఖకు సంబంధించిన సమాచారాన్ని అతడు అందించాడు. (UP Man Lured By Pak Agent) ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక దళం అతడ్ని అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రవీంద్ర కుమార్ పని చేస్తున్నాడు.
కాగా, పాక్ ఐఎస్ఐకు చెందిన మహిళా ఏజెంట్ నేహా శర్మ కోడ్ నేమ్తో ఫేస్బుక్లో అతడికి పరిచయమైంది. హనీట్రాప్లో పడిన రవీంద్ర కుమార్, రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమెకు అందజేశాడు. గగన్యాన్ అంతరిక్ష ప్రాజెక్ట్, మిలిటరీ లాజిస్టిక్స్, డ్రోన్లకు సంబంధించిన రహస్య డేటాను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని ఉగ్రవాద నిరోధక దళం ఈ విషయాన్ని పసిగట్టింది. దీంతో రవీంద్ర కుమార్ను ప్రాథమికంగా విచారించారు. ఆగ్రాలోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయంలో అతడ్ని ప్రశ్నించారు. కీలకమైన రక్షణ సమాచారాన్ని పాక్ ఏజేంట్కు షేర్ చేసినట్లుగా దర్యాప్తులో తేలేడంతో అరెస్ట్ చేశారు.
కాగా, నేహా శర్మ కోడ్ కలిగిన పాక్ మహిళా ఏజెంట్ను ‘చందన్ స్టోర్ కీపర్ 2’ పేరుతో మొబైల్ ఫోన్లో రవీంద్ర కుమార్ సేవ్ చేసుకున్నాడని యూపీ ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపారు. డేటా లీక్ నేపథ్యంలో అన్ని ఆయుధ కర్మాగారాలు, ఇతర రక్షణ సంస్థల వద్ద భద్రతా ప్రోటోకాల్ను కఠినతరం చేయాలని సూచించినట్లు వెల్లడించారు.
#WATCH | Lucknow | ADG UP ATS Nilabja Choudhary says, “ATS UP and their associate agencies got info that there is a person named Ravindra Kumar was sharing different confidential and sensitive information with his Pak ISI handler. So, working on this, our Agra unit did a… pic.twitter.com/kzZBxUuKkM
— ANI (@ANI) March 14, 2025