న్యూఢిల్లీ: ఒక వ్యక్తిని తుపాకులతో బెదిరించిన ముగ్గురు, ఖరీదైన కారును దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన రాహుల్, శనివారం ఉదయం 5 గంటలకు నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతానికి టయోటా ఫార్చ్యూనర్ కారులో వచ్చాడు. జాతీయ రహదారి 8 పై ఉన్న ఝరేరా గ్రామం సమీపంలో ఒక చోట తన కారును ఆపాడు.
కాగా, ముగ్గురు వ్యక్తులు బైక్పై అక్కడకు వచ్చారు. కారు నుంచి కిందకు దిగిన రాహుల్ను గన్తో వారు బెదిరించారు. అతడి నుంచి బలవంతంగా కారు తాళాలు తీసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు ఖరీదైన ఆ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక జంట ఈ సంఘటనను చూసి షాక్ అయ్యింది.
అనంతరం రాహుల్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కారు దోపిడీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రద్దీగా ఉండే జాతీయ రహదారిలో గన్స్తో బెదిరించి ఖరీదైన కారును దోపిడీ చేయడం కలకలం రేపింది.
दिल्ली : बाइक सवार तीन युवक फायरिंग करके लूट ले गए Toyota कार, CCTV में कैद हुई वारदात pic.twitter.com/RyMNm0Eov7
— NDTV India (@ndtvindia) October 30, 2022