లక్నో: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య ప్రియుడ్ని ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికాడు. వాటిని ఒక ప్రాంతంలో పడేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ దారుణ సంఘటన జరిగింది. మిలాల్ ప్రజాపతి అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ జీవిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాజస్థాన్లోని కోట్పుట్లీకి చెందిన అక్షయ్ కుమార్, తన భార్య మధ్య వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం అతడ్ని ఇంటికి పిలువాలని భార్యతో చెప్పాడు. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో గురువారం సాయంత్రం అతడు వచ్చాడు.
కాగా, కుమార్తెకు కాలిన గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రజాపతి భార్య ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్తో ప్రజాపతి మద్యం తాగించాడు. ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడ్ని హత్య చేశాడు. అక్షయ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా సరికాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకు తన రిక్షాలో తీసుకెళ్లి ఖోడా కాలనీ ప్రాంతంలో పడేశాడు.
మరోవైపు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ్ మృతదేహం ముక్కలు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితుడు ప్రజాపతిని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ హత్యలో నిందితుడి భార్య పాత్ర ఉన్నదా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.