జైపూర్: మరో వ్యక్తితో స్నేహం చేస్తోందన్న అనుమానంతో భార్యపై భర్త ఆగ్రహించాడు. గొడ్డలితో నరికి ఆమెను హత్య చేశాడు. (Man Kills Wife) ఆపై మంటల్లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు రక్షించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూనియా ఖేడా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాజు తన భార్య అయిన 30 ఏళ్ల నానికి మరో వ్యక్తితో స్నేహం ఉందని అనుమానించాడు. మంగళవారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఎండు గట్టికి నిప్పంటించి అందులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కాగా, గమనించిన స్థానికులు మంటల్లో దూకిన రాజును కాపాడారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.