ముంబై : సంగీతం అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. తగిన మోతాదులో సౌండ్ పెట్టుకుని వింటే మనసుకు హాయినిస్తోంది. కానీ సౌండ్ పెద్దగా పెట్టి వింటే చికాకు కలుగుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెట్టి.. ఇతరులకు హానీ కలిగించే విధంగా సౌండ్ పెట్టాడు. సౌండ్ తగ్గించమని అడిగితే తిరస్కరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మరో వ్యక్తి.. అతనిపై దాడి చేసి చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని అంబుజావాడి ఏరియాలో బుధవారం రాత్రి సురేంద్ర కుమార్ గున్నార్(40) అనే వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెట్టుకున్నాడు. సౌండ్ కూడా పెద్దగా పెట్టుకోవడంతో, ఆ ఇంటి పక్కనే ఉన్న సైఫ్ అలీ చంద్కు(25)కు చికాకు కలిగించింది. దీంతో సౌండ్ తగ్గించని సురేంద్ర కుమార్ను కోరినప్పటికీ అతను తిరస్కరించాడు. ఈ క్రమంలో సైఫ్ అలీ.. సురేంద్రపై దాడి చేసి చంపేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సైఫ్ అలీని అదుపులోకి తీసుకున్నారు.