భోపాల్: సహజీవనం చేస్తున్న మహిళకు మరొకరితో సంబంధం ఉందని ఒక వ్యక్తి అనుమానించాడు. వేరుగా నివసిస్తున్న ఆమెపై పగపెంచుకున్నాడు. ఆ మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. పగులగొట్టిన బీర్ బాటిల్తో బాలుడి గొంతుకోసి చంపాడు. (Man Kills Son Of Live In Partner) మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెతుల్లో నివసిస్తున్న 36 ఏళ్ల గణేష్ మీనా ఒక మహిళతో కలిసి సహజీవనం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. దీంతో ఆ మహిళ సర్నీ పట్టణంలో వేరుగా నివసిస్తున్నది. అయితే ఆరేళ్ల కుమారుడ్ని గణేష్ వద్ద ఉంచింది.
కాగా, మంగళవారం మద్యం సేవించిన గణేష్ మీనా, రెండో తరగతి చదువుతున్న ఆ బాలుడి స్కూల్కు వెళ్లాడు. ఆ పసివాడ్ని తన వెంట తీసుకెళ్లాడు. నిర్మాణుష్య భవనం వద్ద ఆరేళ్ల బాలుడిపై దాడి చేశాడు. పగలగొట్టిన బీర్ బాటిల్తో గొంతు కోసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గణేష్ మీనాను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.