లూధియానా: పంజాబ్లోని లూధియానా కోర్టు బాంబు పేలుళ్లలో మరణించిన వ్యక్తి మాజీ పోలీస్ గగన్దీప్ సింగ్గా పోలీసులు గుర్తించారు. 2019లో అతడు డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్టయ్యాడు. దీంతో విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో అతడిని బాధితుడిగా పరిగణిస్తారా అన్న ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. ‘అతడిని బాధితుడిగా పరిగణించట్లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ప్రాథమిక ఆధారాలను బట్టి అతడే నిందితుడిగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, లూధియానా కోర్టులో బాంబు పేలుళ్ల వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక గ్యాంగ్స్టర్ హర్విందర్సింగ్ అలియాస్ రిండా సింగ్ సాయంతో ఈ సంస్థ చీఫ్ వాధవ సింగ్ బబ్బర్ ఈ పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు.