లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెండ్లై ఆరేండ్లయినా పిల్లలు కావడంలేదని భార్య ప్రైవేట్ భాగాలపై బ్లేడ్తో దాడిచేశాడు షాడిస్ట్ భర్త. లక్నోకి చెందిన రవీంద్రకు ఆరేండ్ల క్రితం వివాహమయింది. ఇన్నేండ్లయినా తన భార్య గర్భం దాల్చడం లేదని ఆగ్రహంతో ఉన్నాడు. ఈ విషయమై దంపతులిద్దరు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో ఆమె గత ఎనిమిది నెలలుగా తన తల్లిగారింట్లో ఉంటున్నది.
అయితే ఆదివారం రాత్రి అత్తగారింటికి వెళ్లిన రవీంద్ర.. ఇద్దరం కలిసుందామని, ఇంటికి రావాలని తన భార్యను ఒప్పించాడు. అనంతరం ఆమెతో అసహజ సెక్స్కు ప్రయత్నించాడు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన అతడు.. ఆమె రహస్య భాగాలపై బ్రేడుతో దాడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న రవీంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశారు.