బెంగళూరు, మే 31: అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇలా ప్రతిరోజూ నూడిల్స్ను మాత్రమే వండి వడ్డిస్తున్న భార్యతో విసిగి వేసారిన ఓ భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. నెల జీతం పడగానే తనను సూపర్ మార్కెట్కు తీసుకుపోయే భార్య.. నూడిల్స్ తప్పించి ఏమీ కొనుగోలు చేయదని ఆ భర్త మండిపడ్డాడు. నూడిల్స్ తప్పించి ఆమెకు మరేమీ వండరాదని వాపోయాడు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఈ ఘటనను సెషన్స్ కోర్టు జడ్జి ఎంఎల్ రాఘునాథ్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గుర్తు చేసుకొన్నారు. సదరు భర్త విజ్ఞప్తి మేరకు చేసేదేమిలేక విడాకులు మంజూరు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.