బెంగళూరు : ఓ 20 ఏండ్ల యువకుడు భయంకరమైన స్టంట్కు పాల్పడ్డాడు. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్ను ఎక్కబోయి జారిపడ్డాడు. బాధితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కర్ణాటక చిక్కబళ్లపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర డ్యామ్ నుంచి మత్తడి దుంకుతోంది. అయితే అక్కడికి చేరుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు.. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్ను కింద నుంచి ఎక్కేందుకు యత్నించాడు. 25 ఫీట్ల ఎత్తు వరకు బాగానే ఎక్కాడు. ఆ తర్వాత పట్టు తప్పడంతో జారి పడ్డాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడున్న వారు బాధితుడిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Despite pleases from bystanders-a youth tried to scale the wall of Srinavasa Sagara dam in #Chikkaballapur #Karnataka resulting in falling from 30 feet of the slippery dam wall. After climbing over half way he lost balance and fell. He has been rushed to #Bengaluru for treatment pic.twitter.com/NX9Gqcxygj
— Imran Khan (@KeypadGuerilla) May 23, 2022