బెంగళూరు, జనవరి 20: ఓ వ్యక్తిని కారు బానెట్పై కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటుచేసుకున్నది. శుక్రవారం దర్శన్ అనే వ్యక్తి కారు, ప్రియాంక కారు ఢీకొన్నాయి. దీంతో కారులో నుంచి దిగిన దర్శన్.. ప్రియాంక వద్దకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే ప్రియాంక తన కారును అలాగే ముందుకుపోనిచ్చారు. దీంతో దర్శన్ కారు బానెట్పై (ఇంజిన్పై కప్పుపై) రెండు చేతులు పెట్టిఅడ్డంగా నిల్చొన్నాడు. స్పందించని ప్రియాంక కారును అలాగే ఒక కిలోమీటరు దూరం వరకు నడిపారు.