న్యూఢిల్లీ: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకొన్నది. అత్తార్ రషీద్ (30) బాచ్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకొన్నాడు. అది వికటించి మరణించాడు. సర్జరీ అనంతరం పలు అవయవాలు పనిచేయకుండా పోయాయి. కిడ్నీలు పాడయ్యాయి. తల వాచిపోయింది. కొన్ని నెలల పాటు నరకం అనుభవించిన తర్వాత తన బిడ్డ మరణించాడని తల్లి ఆసియా బేగం కన్నీరు పెట్టుకొన్నారు. ‘నేను నా కొడుకును కోల్పోయాను. కొంతమంది వ్యక్తుల ఇలాంటి మోసపూరిత పద్ధతుల కారణంగా ఏ తల్లీ తన బిడ్డను కోల్పోకూడదు’ అని ఆమె మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో టీవీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసే రషీద్.. గత ఏడాది ఓ స్పెషల్ ఆఫర్ కింద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకొన్నాడు. ఇందుకు సరైన శిక్షణ, నైపుణ్యం లేని సర్జన్ల(కౌబాయ్ సర్జన్లు) క్లినిక్లో రూ.15 వేల ఫీజు చెల్లించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సర్జరీ చేసిన క్లినిక్పై పోలీసులకు ఫిర్యాదు అందగా.. సర్జరీ చేసిన ఇద్దరితో పాటు నలుగురిని అరెస్టు చేశారు. ఘటనపై అసోసియేషన్ ఆఫ్ హెయిర్ రీస్టోరేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా కార్యదర్శి మయాంక్ సింగ్ మాట్లాడుతూ.. కౌబాయ్ క్లినిక్ల వలన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తున్నదని అన్నారు.