సాధారణంగా పెళ్లిళ్లలో ఎవరైనా పెళ్లి కొడుకును, పెళ్లి కూతురును పెళ్లి మండపానికి తీసుకురావడం కోసం.. లేదా ఊరేగింపు కోసం కారును రెంట్కు తీసుకుంటారు. సొంతంగా కారు ఉంటే అందులో ఊరేగిస్తారు. కానీ.. ఓ తండ్రి మాత్రం తన కొడుకు పెళ్లి కోసం ఏకంగా హెలికాప్టర్నే బుక్ చేశాడు. అది కూడా రూ.6.5 లక్షలు పెట్టి మరీ తన కొడుకు పెళ్లి కోసం హెలికాప్టర్ను బుక్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కరౌలి జిల్లా కమ్రి అనే గ్రామంలో చోటు చేసుకుంది.
విజేందర్ సైనీ అనే పెళ్లి కొడుకు.. తన పెళ్లి కోసం కమ్రి గ్రామానికి హెలికాప్టర్లో వచ్చాడు. అక్కడ దిగి పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కూతురును తీసుకెళ్లి హెలికాప్టర్లో ఎక్కించి అక్కడి నుంచి తన ఊరు భరత్పూర్కు వెళ్లిపోయాడు.
తన కొడుకు పెళ్లి కోసం హెలికాప్టర్ను బుక్ చేస్తానని.. విజేందర్ సైనీ తండ్రి రాధేశ్యామ్ తండ్రి ఆ ఊరి ప్రజలకు చెప్పాడట. చెప్పినట్టే.. తన కొడుకు పెళ్లికి రూ.6.5 లక్షలు ఖర్చు పెట్టి మరీ హెలికాప్టర్ను బుక్ చేశాడు రాధేశ్యామ్.
నిజానికి.. రాధేశ్యామ్ది ధనవంతుల కుటుంబం కూడా కాదు. మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ.. తన కొడుకు కోసం ఊరికి హెలికాప్టర్ తెప్పించడంతో ఆ ఊరి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు.