న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వెలుపల ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర కాలిన గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. 50 ఏండ్ల వ్యక్తి శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు కొత్త భవనం వద్దకు వచ్చాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు, పోలీసులు మంటలు అర్పారు.
కాలిన గాయాలైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియదన్నారు. నోయిడాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.