న్యూఢిల్లీ: కోల్కతాలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి ఆమె లేఖ రాయడం రెండోసారి. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళను క్రూరంగా రేప్ చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీన కోల్కతా రేప్ ఘటన గురించి ఓ లేఖ రాశానని, ఆ కాపీని కూడా జత పరుస్తున్నానని, అత్యాచార ఘటనల పట్ల కఠినమైన శిక్షను విధిస్తూ చట్టాలను తయారు చేయాలని కోరుతున్నట్లు దీదీ తన లేఖలో తెలిపారు. అయితే మొదటి లేఖకు మీ నుంచి ఎటువంటి స్పందన రాలేదని, సున్నితమైన అంశం గురించి మీరు ఇంకా స్పందించలేదని రెండో లేఖలో దీదీ పేర్కొన్నారు.
తన తొలి లేఖకు మోదీ స్పందించకపోవడం పట్ల బెంగాల్ సీఎం నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ లేఖకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నుంచి రెస్పాన్స్ వెళ్లింది. కానీ ఆ శాఖ ఇచ్చిన సమాధానం పట్ల దీదీ సంతృప్తిగా లేదు. రేపిస్టుల పట్ల కఠిన శిక్ష విధించాలని కోరుతూ మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలోనూ ఈ అంశం గురించి త్వరలో తీర్మానం చేయనున్నారు.
I have written this letter to the Hon’ble Prime Minister of India in connection with an earlier letter of mine to him. This is a second letter in that reference. pic.twitter.com/5GXKaX6EOZ
— Mamata Banerjee (@MamataOfficial) August 30, 2024