ఇన్నాళ్లకు మళ్లీ జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుదలతో జూ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితో పాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యాన వనాలు కూడా తెరుచుకున్నాయి. లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ ఓపెన్ కావడంతో సందర్శకులు భారీగానే వచ్చారు. కరోనా నిబంధనలను పాటిస్తూ సందర్శకులను లోపలికి అనుమతించారు.