కోల్కతా, ఏప్రిల్ 11: దేశ పౌరులను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్రం తెచ్చిన చట్టాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), సీఏఏలను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయనివ్వనని హామీనిచ్చారు.
వీటిని బలవంతంగా అమలు చేసేందుకు తాము అంగీకరించబోమని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ను పురస్కరించుకుని గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ..దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజలను, విపక్షాలను భయపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వివిధ మతాలకు చెందిన వారి మధ్య సోదరభావం వెల్లివిరుస్తుండటం వల్లే ప్రజలు శాంతంగా జీవిస్తున్నారన్నారు. తాను బతికున్నంత వరకు మీకెలాంటి హాని కలగనీయనని బెనర్జీ హామీ ఇచ్చారు.