జైపూర్, జూన్ 13: పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం చట్టం తేకుంటే అన్నదాతలు మళ్లీ ఉద్యమబాట పడుతారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. రైతుల ఉద్యమం ముగిసిపోలేదని స్పష్టంచేశారు. గవర్నర్ పదవి నుంచి 4 నెలల్లో విరమణ పొందుతానని, ఆ తర్వాత తానూ రైతు ఉద్యమంలో నేరుగా పాల్గొంటానని తెలిపారు. రైతు ఉద్యమం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మాలిక్ చాలాసార్లు నిలదీసిన విషయం తెలిసిందే.